Thursday, April 25, 2024

ఫోన్ మాట్లాడుతూ ప‌ట్టాల పైకి.. రైలు ఢీకొని యువ‌కుడు మృతి..

ఫోన్ మాట్లాడుతూ ప‌ట్టాల‌పైకి వ‌చ్చిన యువ‌కుడిని రైలు ఢీకొని మృతి చెందిన ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలోని గుండ్ల‌పోచంప‌ల్లిలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ తాడ్వాయి మండలం, ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన మహేందర్‌ రెడ్డి కుమారుడు బోనాల నర్సింహారెడ్డి(18) మేడ్చ‌ల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లిలో కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఇత‌ను ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. సోమ‌వారం రాత్రి ఆ యువ‌కుడు ఫోన్‌ మాట్లాడుతూ హాస్టల్‌ నుంచి బయటకు వచ్చాడు. స‌మీపంలోని మేడ్చల్‌ – గుండ్లపోచంపల్లి వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement