Friday, March 29, 2024

భారత్ నుంచి రాకపోకలపై తైవాన్, ఇజ్రాయెల్ నిషేధం

కరోనా కేసుల నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తైవాన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు సోమవారం నాడు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చంగ్ తెలిపారు. కాగా భారత్ నుంచి తిరిగి వస్తున్న తైవాన్ పౌరులను దీని నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు. అయితే వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, 14 రోజుల క్వారంటైన్ పాటించాలని వెల్లడించారు.

అటు కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు ప్రయాణాలను నిలిపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయిల్ పౌరులు భారత్‌కు వెళ్లడంపై తాత్కాలికంగా నిషేదం విధిస్తున్నట్టు పేర్కొంది. తమ పౌరులు కాకుండా ఎవరైనా భారత్‌కు వెళ్లి శాశ్వతంగా స్థిరపడతామంటే వారికి అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 16 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement