Friday, April 19, 2024

తాడేప‌ల్లి గోశాల‌లో సంక్రాంతి సంబ‌రాలు – పాల్గొన్న సీఎం జ‌గ‌న్ దంప‌తులు

తాడేప‌ల్లి గోశాల‌లో నిర్వ‌హించిన సంక్రాంతి సంబ‌రాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. “మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.” అంటూ ట్వీట్ చేశారు.ఈ వేడుక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి పాల్గొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి సంబ‌రాలు జ‌రిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో సంక్రాంతి పండుగ సంబరాలకు వర్షం ఆటంకంగా తయారయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement