Friday, March 29, 2024

నేడు రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు నేతలు. అలాగే… తెలంగాణలో ప్రజా సమస్యల పై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యం లోనే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ తో సమావేశం కానున్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ తో గీతా రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అజ్మతుల్లా, అజరుద్దీన్, మధుగౌడ్, మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు. అంతేకాదు,.. రాహుల్ గాంధీ తో సి.ఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క కూడా సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం కానుంది.

అంతేకాదు ఈ నెలలో కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్ సభ వుంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు నేతలు. రాహుల్ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం వుందని తెలంగాణ పీపీసీ నేతలు చెబుతున్నారు. ఇవాళ సమావేశం తర్వాత ఈ అంశం ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట

Advertisement

తాజా వార్తలు

Advertisement