Thursday, April 18, 2024

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి ఆదిలాబాద్‌ పట్టణంలో కలకలం రేపింది. సంజయ్‌నగర్‌ కాలనీలో నివాస‌ముంటున్న‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరుణ తెల్లవారుజామున భవనం నుంచి పడి తీవ్రంగా గాయాలపాలయింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ప్రమాదవాశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement