Wednesday, April 24, 2024

నేటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్) టోకెన్ల జారీ
ప్రక్రియ ఆదివారం రాత్రి ముగిసింది. కరోనా కేసులు ఉధృతం అవుతున్న క్రమంలో మహారాష్ట్రంలోని షిరిడీ ఆలయంలో కూడా భక్తులకు దర్శనం నిలుపదల చేసిన విషయం విదితమే.

తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి లోనిభూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో టైంస్లాట్టో కెన్ల జారి కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైలో వేచి ఉండడం వల్ల మరింతగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో భక్తులఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ
నిర్ణయాన్ని గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారి చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement