Tuesday, April 16, 2024

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది సూసైడ్ కాదు.. మ‌ర్డ‌ర్‌ అంటున్న హాస్పిటల్ స్టాఫ్

బాలీవుడ్ ని షేక్ చేసిన సినీ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించాడు. ముంబై పోలీసులు మాత్రం దీన్ని సూసైడ్‌ కేసుగా నమోదు చేశారు. అట్ల‌నే దర్యాప్తు చేశారు. కానీ, ఆ త‌ర్వాత‌ జనాగ్రహం చూసి కేసును మిస్టరీ కేసుగా మార్చారు. ఈడీ, సీబీఐ, ఎన్‌సీబీ వంటి ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా ఈ కేసును చేతిలోకి తీసుకున్నాయి. కానీ, ఇంత వరకు అస‌లు నిజాన్ని బయటకు తీసుకురాలేకపోయాయి.

బాలీవుడ్ అంతా కలిసి సుశాంత్ సింగ్‌ను పొట్టన పెట్టుకుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌టి రియా చక్రవర్తి చుట్టూనే ఈ కేసు తిరిగింది. సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్‌ది కూడా హత్యనా? ఆత్మహత్యనా? అనేది తేల్చ లేకపోయారు. ఈ రెండు కేసులకు సంబంధం ఉండే ఉంటుందని జనాలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. రియా చక్రవర్తి మహేష్ భట్ ఫోటోలు వైరల్ కావ‌డం, సుశాంత్‌కు రియా డ్రగ్స్ ఇవ్వడం వంటి అంశాలు.. ఈ కేసులో ఎన్నెన్నో కోణాలు బయటకు వచ్చాయి. అయితే.. తాజాగా సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హించిన హాస్పిట‌ల్ స్టాఫ్ మాత్రం అది ఆత్మ‌హ‌త్య కాదు. మ‌ర్డ‌ర్ అనే విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ కేసు ఎటు తిరిగి ఏమ‌వుతుందో చూడాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement