Friday, April 19, 2024

పెగాసస్‌ పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

పెగాసస్‌ స్నూపింగ్ స్కామ్‌పై విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.   పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిసి విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది.  పిటిషనర్ల ప్రతులు అందాయని, అధ్యయనం చేస్తున్నానని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. శుక్రవారం విచారణ జరపలేమని స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని కోరారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్… దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్న భారత ప్రధాన న్యాయమూర్తి… విచారణను సోమవారానికి వాయిదా వేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఒలింపిక్స్ లో జెంటిల్ మేన్ గేమ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement