Saturday, April 20, 2024

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ వాసి ఒకరు పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఎందుకు వేశారని జస్టిస్‌ లలిత్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. వెకేషన్‌ బెంచ్‌ సెలవుల సమయంలో రిట్‌, క్వాష్‌ పిటిషన్‌ స్వీకరించబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని.. పిటిషనర్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. సెలవుల సమయంలో క్వాష్‌, రిట్‌ పిటిషన్లను వినకూడదని హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement