Thursday, April 25, 2024

సునాక్‌ కుమార్తె.. కూచిపూడి నృత్యం

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కుమార్తె భారతీయ కళలపై మక్కువ చూపుతోంది. తొమ్మిదేళ్ల అనౌష్క సునాక్‌ తాజాగా లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాంగ్‌-2022 పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ప్రపంచ నలుమూలల నుంచి 4-85 ఏళ్ల మధ్య వయసు కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో సునాక్‌ కుమార్తె కూడా పాల్గొన్నారు. కొందరు చిన్నారులతో కలిసి అనౌష్క ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. రిషి సతీమణి అక్షతా మూర్తి, సునాక్‌ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement