Saturday, April 20, 2024

అవినీతి కేసులో సూళ్లూరుపేట ఆర్డీవో అరెస్ట్

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మాండ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోట్ల రూపాయల సివిల్ సప్లైస్ కుంభకోణం కేసులో రోజ్మండ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
తవ్వే కొద్ది బయటపడుతున్న భారీ తిమింగలాలు..
ప్రధాన నిందితుడు శివకుమార్ ప్రియురాలికి రెండు కేజీ బంగారం ఇచ్చినట్టు, రోజ్మాండ్ కుటుంబానికి సంబంధించి ఆమె కుటుంబంలో జరిగిన ఒక వివాహానికి రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గతంలో ఎండిగా పనిచేసి, ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మండ్ కూడా అవినీతికి పాల్పడినట్లు పూర్తి ఆధారాలు దొరకడంతో ఆర్డీఓగా పనిచేస్తున్న ఈమె అరెస్టుకు రాష్ట్ర సీఎస్ పర్మిషన్ కోరిన ఏసీబీ అధికారులు అనుమతులు రాగానే అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరచడంతో రోజ్మండ్ కు జనవరి 4వ తారీఖు వరకు రిమాండ్ విధించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు పలుచోట్ల వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించి వాటిని సీజ్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఆర్డీవో రోజ్మాండ్ అరెస్టుతో కేసు కీలక దశకు చేరుకున్నట్టు ఈమెకు సంబంధించిన ఆస్తులు కూడా త్వరలోనే గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement