Wednesday, April 24, 2024

ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరైన సుజనా చౌదరి

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి చెన్నైలోని ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. రూ.363కోట్ల బ్యాంక్ బకాయిల వివాదంలో విచారణకు ఎంపీ సుజనా చౌదరి హాజరయ్యారు. మూడు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. మనీలాండరింగ్ చట్టం కిందే సుజనాచౌదరికి చెన్నై కోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement