Monday, April 15, 2024

డైరెక్ట‌ర్‌గా సుధీర్ బాబు..హీరోయిన్‌గా కృతిశెట్టి.. ఆక‌ట్టుకుంటున్న ట్రైలర్..!

సుధీర్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో సుధీర్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమానుంచి రిలీజ్ అయిన‌ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మంచి ఒపీనియ‌న్ నే క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా కొద్ది సెప‌టి క్రితం ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో డాక్టర్ పాత్రలో కృతి కనిపించగా.. సుధీర్ ఫిల్మ్ మేకర్‏గా కనిపించనున్నారు. ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తున్న ట్రైలర్ లోని సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మ‌రి ఈ ట్రైల‌ర్ ఎలా ఉందో మీరు చూడండి..!

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement