Thursday, March 28, 2024

Follow up | మార్కెట్లకు వరస నష్టాలు.. అమెరికా బ్యాంక్‌ల పతనం ప్రభావం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా నాలుగవరోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు కొద్దిగా పుంజుకున్నాయి. చివరి వరకు ఇది కొనసాగలేదు. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ పతనం ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఈ పరిణామం మార్కెట్ల సెంట్‌మెంట్‌ను దెబ్బతీసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లనీ నష్టాల్లోనే ముగిశాయి.

సెన్సెక్స్‌ 337 పాయింట్ల నష్టపోయి 57900.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 111.00 పాయింట్ల నష్టంతో 17043.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 116 రూపాయలు తగ్గి 57526 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 293 రూపాయలు తగ్గి 66359 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.01 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

టైటాన్‌ కంపెనీ, భారతీ ఎయిర్‌ టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఇండాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీసుజుకీ, ఆపోలో ఆస్పిటల్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement