Thursday, April 25, 2024

మళ్లీ రిపీట్ కానున్న సక్సెస్‌ఫుల్ కాంబో..

టాలీవుడ్ మాస్ అండ్ సక్సెస్‌ఫుల్ కాంబో బాలకృష్ణ, బోయపాటి శ్రీను. వీరిద్దరూ మరో భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ వంటి సూపర్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లతో హ్యాట్రిక్ కొట్టేశారు. బోయపాటితో సినిమా బాలయ్యకు బాక్సాఫీస్ వద్ద కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలానే బాలయ్యతో వరుస హిట్లు కొట్టినందుకు బోయపాటి టాప్ దర్శకులలొ ఒకరిగా నిలిచారు.

కాగా, త్వరలో వీరిద్దరూ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి ఇద్దరూ తమ ప్రస్తుత కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వగానే వీరు కలవనున్నారని సినీ వర్గాల సమాచారం.

బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్‌తో కలిసి పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్‌లో పనిచేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల రామ్ కు జోడీగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

మరోవైపు బాలయ్య, అనిల్ రావిపూడితో NBK108 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కుమార్తెగా కనిపించనుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement