Tuesday, April 23, 2024

విద్యార్థిని కిడ్నాప్‌… గ‌న్‌తో బెదిరించి ఆ పనిచేశారు..

ప్ర‌భ‌న్యూస్ : ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని ఇంటి ప‌క్క‌నున్న ఓ యువ‌కుడు, అత‌ని సోద‌రుడు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి తాగించారు. అనంత‌రం సోద‌రులిద్ద‌రూ ఆ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆపై స్మార్ట్ ఫోన్‌లో ఆ దృశ్యాల‌ను వీడియో తీశారు. స్పృహ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత బాలిక కామాంధుల చెర నుంచి త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది.

విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. తండ్రితో క‌లిసి పోలీసుస్టేష‌న్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదుచేసుకుని, బాలికను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రం స‌హార‌న్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement