Friday, April 26, 2024

BREAKING : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం క్రైమ్ : ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని బిల్డింగ్ పైన దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ చదువుతున్న చైతన్య (17) అనే విద్యార్థిని కాలేజీలో రెండు అంతస్తుల బిల్డింగ్ పై నుండి కిందికి దూకింది. వెంటనే కళాశాల యాజమాన్యం నగరంలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. విద్యార్థిని చైతన్యకు తీవ్రగారాలైనట్టు విద్యార్థులు తెలుపుతున్నారు. కాలేజీలో టీచర్ మందలించినట్టు సమాచారం. ఈ విద్యార్థిని నేలకొండపల్లి చెందిన వాసిగా గుర్తించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలవడంతో వారు ఖమ్మం బయలుదేరారు. శ్రీ చైతన్య కళాశాలలో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు మూడు జరిగాయని విద్యార్థులు తెలుపుతున్నారు. కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం వేధింపుల‌కు గురిచేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement