Tuesday, April 16, 2024

Dog Attack : వీధి కుక్క‌ల వీరంగం.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు..

కుక్క‌ల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కుక్క‌లు దాడికి చేశాయి. శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థి పై వీధి కుక్క‌లు దాడిచేయ‌గా.. మ‌రోవైపు వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాపాక యేసయ్యపై కుక్క‌లు దాడి చేశారు. పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డ యేస‌య్య‌ను మెరుగైన వైద్యం కోసం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కేశవపట్నం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో ఏడవ తరగతి విద్యను అభ్యసిస్తున్న పిన్ రెడ్డి సుమంత్ రెడ్డి అనే విద్యార్థి పై హాస్టల్లోకి వీధి కుక్క చొరబడి కరవడంతో గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement