Monday, April 15, 2024

గుర్తుతెలియ‌ని దుండ‌గులు-విశాల్ ఇంటిపై రాళ్ల దాడి

సినీ పరిశ్రమలో హీరో విశాల్ కి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆయన నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. తమిళ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంపై తెలుగువాడైన విశాల్ ఆధిపత్యాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. విశాల్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ లైకా తో విశాల్ కి వివాదం నడుస్తుంది. లైకా సంస్థ విశాల్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ హైకోర్ట్ లో పిటిషన్ వేసింది. కాగా కొందరు దుండగులు త‌మిళ హీరో విశాల్ ఇంటిపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో విశాల్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎర్ర కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు విశాల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. అనంతరం అదే కారులో అక్కడి నుండి పారిపోయారు. ఈ దాడి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ దాడి సమయంలో విశాల్ ఇంట్లో లేరని సమాచారం. షూటింగ్ నిమిత్తం విశాల్ అవుట్ డోర్ లో ఉన్నారు. చాలా కాలంగా విశాల్ అన్నా నగర్ లో గల ఇంటిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిపైనే దుండగులు దాడి చేశారు. విశాల్ మేనేజర్ దాడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement