Friday, March 29, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్‌లో వరసగా మూడు రోజుల లాభాలకు శుక్రవారం నాడు బ్రేక్‌ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే బాటులోనడిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు కూడా నష్టపోవడంతో సూచీలకు ఏ దశలోనూ మద్దతు లభించలేదు. సెన్సెక్స్‌ 316.94 పాయింట్లు నష్టంతో 61002.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.65 పాయింట్ల నష్టంతో 17944.20 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 396 రూపాయలు తగ్గి 55832 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 1126 రూపాయలు తగ్గి 64507 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.82 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

ఎల్‌ అండ్‌ టీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, దివిస్‌ ల్యాబ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఆటో, అపోలో ఆస్పటల్స్‌, హీరో మోటో కార్ప్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement