Saturday, April 20, 2024

Follow up | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌మార్కెట్లు వరసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు అండగా నిలిచాయి. పలు దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభపడ్డాయి. ఫిబ్రవరిలో వాహన అమ్మకాల్లో గణనీయంగా వృద్ధి సాధించడంతో ఆయా కంపెనీల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 415.49 పాయింట్ల లాభంతో 60224.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 117.10 పాయింట్ల లాభంతో 17711.45 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 139 రూపాయలు పెరిగి 55860 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 179 రూపాయలు పెరిగి 64580 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.47 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, టీసీఎస్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌మహీంద్రా, మారుతీ సుజుకీ, టైటాన్‌ కంపెనీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

- Advertisement -

టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఆటో, ఇండాల్కో, జేఎస్‌బడ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement