Tuesday, March 26, 2024

కొమురం భీమ్ లా – వినాయ‌క విగ్ర‌హం

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ లా వినాయ‌కుడి విగ్ర‌హాన్ని రూపొందించారు. ఆగస్టు 31 వినాయక చవితి..ఈ పండుగ‌కి ఇంకా నాలుగు వారాలే ఉండటంతో వినాయక విగ్రహాల తయారీ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ క్రమంలో భీమ్ రూపంలో ఉన్న గణేష్ విగ్రహాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చేతుల్లో కాగడాలు పట్టుకొని జంతువులతో పాటు ట్రక్ లో నుంచి భీమ్ దూకే షాట్ ని తలపించేలా ఉన్న విగ్రహం ఆకట్టుకుంటోంది. ఇంకా ఆ విగ్రహానికి రంగులు వేయడం పూర్తికాలేదు. రంగులు వేశాక ఆ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement