Wednesday, April 24, 2024

రికార్డుల నిర్వ‌హ‌ణ‌లో స్టేష‌న్‌ రైటర్లదే కీల‌క‌పాత్ర‌.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు

పోలీస్ స్టేషన్లకు చెందిన రికార్డుల నిర్వహణ, వివధ రకాల కేసుల వివరాల నమోదులో రైటర్లు పాత్ర కీలకమైందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. పోలీస్ స్టేషన్లకు చెందిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలో వివిధ పోలీస్ స్టేషన్లు, సర్కిల్, ఏసీపీ కార్యాలయాలకు చెందిన రైటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ కేసుల వివరాల నమోదులో ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పోలీస్ స్టేషన్ల రైటర్లు వివరాలను నమోదు చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శ్రద్ధాసక్తులతో అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

- Advertisement -

పెండింగ్ కేసులు పరిమిత సంఖ్యకన్నా తక్కువ ఉండేలా దర్యాప్తు చేసే అధికారులకు సహాయకులుగా వ్యవహరించాలని సీపీ సుబ్బ‌రాడ‌యుడు చెప్పారు. కేసుల వివరాలను పకడ్బందీగా నమోదు చేసినట్లయితే ఎలాంటి సందేహాలకు తావుండదన్నారు. గుర్తింపు లభించేలా విధినిర్వహణ కొనసాగించాలని చెప్పారు. కేసుల వివరాల నమోదులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని తెలిపారు. పాలీస్ స్టేషన్లలో క్రమపద్ధతిలో రికార్డుల నిర్వహణను కొనసాగించాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు కేసుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు.

వివిధ రకాల సమాచారాన్ని వేర్వేరుగా నిక్షిప్తం చేసినట్లయితే సులువుగా ఉంటుందని సూచించారు. కేసుల నమోదు వివరాలు నమోదు చేయడంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల పని విభాగాల ఏర్పాటుతో పోలీస్ స్టేషన్ల పనితీరు సులభతరంగా మారిందని చెప్పారు. ప్రజలకు సేవచేసేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ కాశయ్య, ఇన్‌స్పెక్ట‌ర్‌ బి. సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement