Friday, April 26, 2024

రాష్ట్ర కేబినెట్​ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్‌పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 6న మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే ఈ నెల 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. వచ్చే ఆదివారం (ఈనెల 12న) సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement