Friday, March 29, 2024

ఎన్టీఆర్ షోకు గెస్ట్‌గా రాజమౌళి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎవరు మీలో కోటీశ్వరులు విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇప్పటికే ప్రారంభ ఎపిసోడ్‌కు రామ్‌చరణ్ గెస్టుగా వచ్చి అందరినీ అలరించాడు. తారక్‌తో ఎన్నో ముచ్చట్లను చెప్పాడు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఎన్టీఆర్‌ షోలో గెస్టుగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. తాజాగా జక్కన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఎందుకంటే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రాజమౌళికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి కారు దిగి స్టూడియోలోకి వెళ్తూ కనిపించారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: మాస్ మసాలా ‘సీటీమార్‌’ ట్రైలర్ వచ్చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement