Thursday, April 25, 2024

శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు.. రేపు గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద కొనసాగుతోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ లకు వరద నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 875 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం డ్యామ్‌కు 3,22,262 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఇక జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 160.9100 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఎడమ గట్టు (తెలంగాణ) ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. బుధవారం నాడు అధికారులు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు.

మరోవైపు నాగార్జున సాగర్ కు 18,142 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 539.10 అడుగుల నీరు ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 3.35 లక్షల ఇన్ ఫ్లో ఉంది. వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నారు. జూరాల డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు ఉంది. అటు తుంగభద్ర జలాశయం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: త్వరలో ఏపీలోని లేఫాక్షికి యునెస్కో గుర్తింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement