Wednesday, April 24, 2024

ఏపీ సీఎం జగన్‌కు గుడి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ సీఎం జగన్‌పై ఓ వైసీపీ ఎమ్మెల్యే అంతులేని ప్రేమ చూపించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దేవాలయాన్ని నిర్మించారు. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను నిర్మించారు.

మరోవైపు నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ సీఎం జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.2 కోట్ల ఖర్చుతో ఈ దేవాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మించారని తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కొనియాడారు. కాగా గతంలోనూ ప.గో. జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో సీఎం జగన్‌కు గుడి కట్టేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: మనవడితో కలిసి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement