Wednesday, April 24, 2024

ఆదిత్యుని దర్శించుకున్న – మంత్రుల బృందం

ప్రత్యక్షదైవం.. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటి సి.ఎం. (పంచాయతీ రాజ్ శాఖ మంత్రి) బూడి ముత్యాల నాయుడు ,డిప్యూటీ సి.ఎం. ( గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) పిడిక రాజన్న దొర , హెూం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ,గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ,పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ,స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ దేవాలయంనకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.వారికి స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ ఈవో వి.హరి సూర్య ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శిరీష ,దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద బాబు, ఆలయ పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి , మండల మన్మధరావు , అంధవరపు రఘురాం , యామిజాల గాయత్రీ , కింజరాపు ఉమారాణి , బైరి రాజరాజేశ్వరి గ,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement