Tuesday, April 16, 2024

మాన‌సిక ఉల్లాసానికి క్రీడ‌లు..రోజా..

నగరి ప్రభన్యూస్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు..రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు-2021 జ‌రుగుతున్నాయి. నగరి డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న బ్యాడ్మింటన్ (షటిల్) అండర్ 17 పోటీలను రోజా ప్రారంభించారు . 17 విన్నర్స్ తెరని జట్టును, రన్నర్స్ మంగాడు జట్టును అభినందించి కప్, మెడల్స్ అందించారు..అనంత‌రం రోజా మాట్లాడుతూ.. చాలా ఉత్కంఠగా జరుగుతున్న ఈ పోటీలు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.. యువత ఉత్సాహం, ఆత్మవిశ్వాసం క్రీడల ద్వారానే రెట్టింపు అవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement