Tuesday, April 16, 2024

Karimnagar | అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి: ఎంపీ వెంకటేష్ నేత

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత సూచించారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి.. అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.నిరుపేదల లబ్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చూడాలన్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం త్వరితగతిన పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ స‌మీక్ష‌లో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement