Friday, April 26, 2024

దసరా పండుగ: ఆ రూట్ లో ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. పండుగ నేపథ్యంలో దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ (07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (07053) ఈ నెల 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07054) ఈ నెల 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవు

Advertisement

తాజా వార్తలు

Advertisement