Thursday, April 25, 2024

ఈ నెల 27న ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్..

ఈ నెల (మార్చి) 27న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ ఇప్పటికే రిలీజ్ చేసింది. కాగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement