Monday, April 15, 2024

వామన్ రావు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. ఇందుకోసం కరీంనగర్ సెషన్స్ కోర్ట్ ను ప్రత్యేక న్యాయస్థానం గా గుర్తించాలని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు ఓ లేఖను రాశారు. ప్రత్యేక కోర్టు ద్వారా అయితే ఈ విచారణ మరింత వేగవంతం అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

అలాగే లాయర్ హత్య కేసుపై సిబిఐ విచారణ చేయించాలని ఇప్పటికే వామన్ రావు తండ్రి కోరగా… హైకోర్టు నిరాకరించింది. తామే స్వయంగా ఈ విచారణను దగ్గరుండి పర్యవేక్షిస్తామని ధర్మాసనం చెప్పుకొచ్చింది. మరి ఇటువంటి సమయంలో కరీంనగర్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement