Saturday, April 20, 2024

పార్టీ కార్యక్రమాల కోసం ప్రత్యేక సమన్వయం క‌మిటీ : కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులు అందరినీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా.బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలల పాటు పార్టీ విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక, అమలుపైన చర్చించాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు విజ్ఞప్తి చేశారు.

జిల్లా – ఇన్ చార్జిల పేరు
వనపర్తి, జోగులాంబ గద్వాల – తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ
మేడ్చల్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల – బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
నల్గొండ – కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
వికారాబాద్ – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ
రంగారెడ్డి – ఎల్. రమణ, ఎమ్మెల్సీ
భద్రాద్రి కొత్తగూడెం – భానుప్రసాద్, ఎమ్మెల్సీ
సంగారెడ్డి – వెంకట్ రామ్ రెడ్డి, ఎమ్మెల్సీ
మెదక్- ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్సీ
మహబూబ్ నగర్, నారాయణపేట – కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
యాదాద్రి భువనగిరి- డా.యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ
నాగర్ కర్నూల్- పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ
భూపాలపల్లి, ములుగు – అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
సిద్దిపేట – బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ
హనుమకొండ, వరంగల్ – ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్
నిర్మల్, ఆదిలాబాద్- వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ
మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ – నారదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ
జనగామ- కోటిరెడ్డి గారు, ఎమ్మెల్సీ
మహబూబాబాద్ – పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్సీ
కామారెడ్డి- దండే విఠల్, ఎమ్మెల్సీ
నిజామాబాద్ – బండ ప్రకాష్, ఎమ్మెల్సీ
జగిత్యాల – కోలేటి దామోదర్, పార్టీ సెక్రెటరీ
పెద్దపల్లి- ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్
హైదరాబాద్- డా. దాసోజు శ్రావణ్, సీనియర్ నాయకులు
ఖమ్మం – శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ
సూర్యాపేట- మెట్టు శ్రీనివాస్, కార్పొరేషన్ ఛైర్మన్

Advertisement

తాజా వార్తలు

Advertisement