Thursday, April 25, 2024

అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన సోనూసూద్

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు 632 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమానికి ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటకు వచ్చిన సోనూసూద్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇదే సమయంలో ఆయనను అమరావతి రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను రైతుల వెంట ఉంటానని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement