Thursday, April 25, 2024

వై ఎస్ ఆర్ అనుచరుడుపై అల్లుడు దాడి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సూరీడుపై దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఉన్న ఇంట్లో బలవంతంగా ప్రవేశించి స్వయానా ఆయన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు.

గతేడాది కూడా సూరీడుపై దాడి సురేంద్రనాథ్ రెడ్డి దాడి చేశాడు. తన కూతురిని వేధింపులకు గురిచేస్తుండడంతో గతంలో అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస కేసు పెట్టారు. ఆ కేసులను ఉపసంహరించుకోవడం లేదనే కక్షతోనే మామ సూరీడును హత్య చేసేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా సూరీడు కుమార్తె గంగా భవాని ఫిర్యాదుతో సురేంద్రనాథ్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement