Friday, March 29, 2024

బిర్యానీ తీసుకురాలేదని కుమారుడు ఆత్మహత్య

తండ్రి బిర్యానీ తీసుకురాలేద‌ని కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. బాలాసోర్​కు చెందిన 13 ఏళ్ల బాలుడు.. బిర్యానీ తీసుకురాలేదని ఆత్మహత్య చేసుకొని.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు. మనోరంజన్​ మహన్న కుమారుడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఆ బాలుడు బిర్యానీ తీసుకురమ్మని తండ్రికి చెబుతున్నాడు. అయితే మనోరంజన్​ బాలాసోర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం వల్ల బిజీగా ఉన్నారు. ఆయన ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసి బాలుడు నిరాశకు గురయ్యాడు. అనంతరం ఆ రోజు రాత్రే గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే చూసిన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. త‌మ కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement