Wednesday, April 24, 2024

కరోనాతో ఉదయం తండ్రి.. రాత్రి కుమారుడు మృతి

కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను కకావికలం చేస్తోంది. తాజాగా తెలంగాణలోని వేములవాడలో మంగళవారం రోజు ఒకేరోజు తండ్రి, కొడుకు మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. వేములవాడకు చెందిన ప్రభుత్వ టీచర్ గుమ్మడి ప్రకాష్ (45), మధురిమ దంపతులకు అభయ్, అభిజిత్ అనే కవలపిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం వీరందరికీ కరోనా సోకగా.. ప్రకాష్ కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. రాత్రికి అభిజిత్ (18) మరణించాడు. దీంతో ప్రకాష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement