Saturday, April 20, 2024

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి : భట్టి విక్రమార్క

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్ర‌భుత్వం వెంట‌నే పరిష్కరించాల‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు బట్టి సంఘీభావం తెలిపారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతుంటే. ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రభుత్వం వివిధ కారణాలతో వేధిస్తుందన్నారు. మూడు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగు సంవత్సరాలకు పెంచడం అన్యాయమని, నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న వారి ప్రొవైషనరి కాలాన్ని డిక్లేర్ చేయకపోవడంపై భ‌ట్టి మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement