Wednesday, April 24, 2024

ప్ర‌పంచ క‌ప్ కు స్మృతి రెడీ

ప్రపంచకప్‌ ముంగిట వార్మప్‌ మ్యాచ్‌లో గాయపడిన భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన కోలుకుంది. స్మృతి మరో మూడురోజుల నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటుందని క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో స్మృతి గాయపడింది. భారత్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సౌతాఫ్రికా బౌలర్‌ ఇస్మాయిల్‌ వేసిన బౌన్సర్‌ను స్మృతి ఫుల్‌షాట్‌ ఆడేందుకు ప్రయత్నించింది. అయితే బంతి ఆమె హెల్మెట్‌కు బలంగా తాకింది.

కంకషన్‌తో స్మృతి ప్రపంచకప్‌కు దూరం అవుతుందని అభిమానులు భావించారు. అయితే ఆమె కోలుకుందని సమాచారం. కాగా మహిళల వన్డే ప్రపంచకప్‌ మార్చి 4నుంచి జరగనుంది. న్యూజిలాండ్‌ వేదికగా మెగాటోర్నీని నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement