Saturday, April 20, 2024

తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో పొగలు.. తప్పిన ప్రమాదం..

తిరుమ‌ల ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్క‌సారిగా ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. దీంతో ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించాయి. రైల్వే స్టేష‌న్ ప‌రిస‌రాలు ద‌ట్ట‌మైన పొగ‌తో క‌మ్ముకుపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటినా బోగి వద్దకు వెళ్లి పొగలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం లేదన్న అధికారులు యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement