Thursday, April 25, 2024

Follow up : మార్కెట్లకు స్వల్ప లాభాలు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప లాభాలతో ముగిశాయి. వరసగా మార్కెట్లు రెండో రోజూ లాభాలు ఆర్జించాయి. చివరి అరగంటలో అమ్మకాలు భారీగా జరగడంతో సూచీలు స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి. చైనాలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం, అమెరికా ఫెడ్‌ రేట్లు ప్రకటించనున్న నేపధ్యంలో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దేశీయంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 91.62 పాయింట్ల లాభంతో 61510.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 23.05 పాయింట్ల లాభంతో 18267.25 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 15 రూపాయలు తగ్గి 52274 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 348 రూపాయలు పెరిగి 61334 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.73 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, మారుతి సుజుకీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌ టీ, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టైటాన్‌ కంపెనీ, టీసీఎస్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement