Tuesday, April 16, 2024

18న శ్రీహరికోటలో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రాకెట్‌ ప్రయోగం.. తొలిసారి ప్రైవేట్‌ సంస్థ ఆరంభం

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ కేంద్రంలో ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తొలి మిషన్‌ను నవంబర్‌ 18న ప్రారంభించనున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాకెట్‌ను 3 రోజులు ఆలస్యం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌- ఉపకక్ష్య ప్రయోగాన్ని నవంబర్‌ 18న ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఆదివారం తెలిపింది. ”ప్రతికూల వాతావరణ సూచన కారణంగా, శ్రీ హరికోట నుండి మా విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నవంబర్‌ 15 నుండి 19 నుండి ప్రయోగించేందుకు అవకాశం ఏర్పడినట్లు నవంబరు 18 ఉదయం 11:30 గంటలకు జరిగే అవకాశం ఉందని” అని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి తెలిపారు.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ యొక్క తొలి మిషన్‌, ‘ప్రారంభ్‌’ (ప్రారంభం) అని పేరు పెట్టామన్నారు. శ్రీ హరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క లాంచ్‌ప్యాడ్‌ నుండి ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ మిషన్‌ స్కైరూట్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. ఎందుకంటే ఇది వచ్చే ఏడాది ప్రారంభించేందుకు ప్రణాళిక చేయబడిన విక్రమ్‌1 ఆర్బిటల్‌ వాహనంలో ఉపయోగించే 80 శాతం సాంకేతికతలను ధృవీకరించడంలో సహాయపడుతుందన్నారు. ”మా ఘన ఇంధన రాకెట్‌ ఇంజిన్‌ ‘కలామ్‌ 1’ పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న కీలకమైన అంశాలలో ఒకటి” అని స్కైరూట్‌ ప్రతినిధి తెలిపారు.

చెన్నైకి చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ భారత్‌-సింగపూర్‌ మరియు ఇండోనేషియా విద్యార్థులచే అభివృద్ధి చేయబడిన 2.5 కిలోల పేలోడ్‌ అయిన ‘ఫన్‌శాట్‌’ని విక్రమ్‌1లో ఉప కక్ష్య విమానంలో నడుపుతుందన్నారు.

ఈ మిషన్‌తో, 2020లో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి తెరవబడిన అంతరిక్ష రంగానికి కొత్త శకాన్ని తెలియజేస్తూ, అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీగా స్కైరూట్‌ అవతరించిందన్నారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కు నివాళిగా స్కైరూట్‌ యొక్క ప్రయోగ వాహనాలకు ‘విక్రమ్‌’ అని పేరు పెట్టారు. ఇది అధునాతన మిశ్రమ మరియు 3డి ప్రింటింగ్‌ టెక్నాలజీలను ఉపయోగించి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్‌, హైపర్‌గోలిక్‌లిక్విడ్‌ మరియు ఘన ఇంధనఆధారిత రాకెట్‌ ఇంజిన్‌లను పరీక్షించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement