Wednesday, April 24, 2024

కుమారైని చూసి మురిసిపోతున్న మ‌హేశ్.. న‌మ్ర‌త‌

త‌మ కుమారై సితార‌ని చూసి మురిసిపోతున్నారు టాలీవుడ్ స్టార్ దంప‌తులు మ‌హేశ్ బాబు..న‌మ్ర‌త‌. సితార చదువుతున్న స్కూల్ లో సెకండరీ స్కూల్ సెలెబ్రేషన్స్ జరిగాయి. సితార కూడా సెకండరీ స్కూల్ లోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు హాజరయ్యారు. తమ కుమార్తె సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటుంటే చూసి మురిసిపోయారు. ఈ విషయాన్ని నమ్రత ఫ్యాన్స్ కి తెలియజేస్తూ బ్యూటిఫుల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.

చాలా గర్వంగా ఉంది. నీవు కొత్త దశలోకి అడుగుపెట్టావు. స్కూల్ సెకండరీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా నీకు కంగ్రాట్స్ సితార. నాన్న, అన్నయ్య, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సితార తమ స్కూల్ టీచర్ నుంచి సెకండరీ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న దృశ్యాలు చాలా బావున్నాయి. హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ సితార తన ఫ్రెండ్స్ తో వేదికపై కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement