Wednesday, April 24, 2024

క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోన్న సార్

వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన చిత్రం సార్..త‌మిళంలో వాతి టైటిల్ తో తెర‌కెక్కించారు.ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో ధ‌నుశ్ న‌టించాడు..హీరోయిన్ గా సంయుక్త‌మీన‌న్ న‌టించింది. సూర్యదేవర నాగవంశీ – త్రివిక్రమ్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 24.21 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక తమిళ వెర్షన్ కి సంబంధించిన వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ సినిమా 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు సామాన్య కుటుంబాలకి చెందిన విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయనేది ఈ సినిమాలో చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement