Wednesday, April 24, 2024

‘మా ఊరి పొలిమేర’కు సీక్వెల్‌

శ్రీకృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా ‘మా ఊరి పొలిమేర’కు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. సత్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్రధారులు. ఉత్తరాఖండ్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఖమ్మం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు వెల్లడిస్తారు.
ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, సినిమాటోగ్రఫీ: ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌.సి.సతీష్‌ కుమార్‌, నిర్మాత : గౌరి కృష్ణ; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : డా.అనిల్‌ విశ్వనాథ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement