Friday, April 19, 2024

చీటింగ్ కి పాల్ప‌డ్డిన‌.. సింగ‌ర్ య‌శ‌స్వి కొండేపూడి

చీటింగ్ కి పాల్ప‌డ్డాడు సింగ‌ర్ య‌శ‌స్వి కొండేపూడి. తనదికాని సంస్థను తనదని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు యశస్వి. ఎన్జీవో సంస్థను నడుపుతూ ఎంతోమంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటున్నట్టు కలరింగ్‌ ఇస్తూ అసలు ఓనర్‌కే ఝలక్‌ ఇచ్చాడు. కాకినాడలో నవసేన ఫౌండేషన్‌ పేరుతో ఓ ఎన్జీవో సంస్థ నడుస్తోంది. సుమారు యాభై.. అరవై మంది అనాథ పిల్లలకు ఆ సంస్థ షెల్టర్ కల్పించి చదివిస్తోంది. అయితే, ఆ సంస్థ తనదే అంటూ కలరింగ్‌ ఇచ్చాడు సింగర్‌ యశస్వి. నవసేన ఫౌండేషన్ లో ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి… అది తానే నడుపుతున్నట్లు ఓ సింగింగ్‌ కాంపిటీషన్‌లో సానుభూతి, ఓట్ల కోసం వినియోగించుకున్నాడు. సింగర్‌ యశస్వి మోసాన్ని బయటపెట్టారు కాకినాడ నవసేన ఫౌండేషన్‌ నిర్వాహకురాలు ఫరా కౌసర్‌. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొరబడినట్టు తన సంస్థను తనదిగా చెప్పుకుంటూ యశస్వి మమ్మల్ని మోసం చేశాడని అంటున్నారు. గత ఐదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 56మంది పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నానంటున్నారు ఫరా. నవసేన ఫౌండేషన్‌కు ఏ సెలెబ్రిటీ నుంచి సహకారం లేదంటున్నారు. తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటోన్న యశస్విపై చర్యలు తీసుకోవాల‌ని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement