Saturday, April 20, 2024

ఓపెనింగ్‌ రౌండ్లోనే ఓడిన సింధూ.. 59 నిమిషాల్లోనే పరాజయం

2023 మలేషియా ఓపెన్‌ ఓపెనింగ్‌ రౌండ్‌లో మారిన్‌ చేతిలో సింధూ ఓడిపోయింది. ఆరో సీడ్‌ సింధూ గాయం కారణంగా లే ఆఫ్‌ తర్వాత బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌కు వచ్చింది. ఆమె చివరి ఈవెంట్‌ 2022 బర్మింగ్‌ హమ్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మలేషియా ఓపెన్‌ సూపర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పివి సింధూ 12-21, 10-21, 15-21 తేడాతో 59 నిమిషాల్లో ఓడిపోయి నిరాశ పరిచింది. సింధూ తన రెండు మోకాళ్లు దెబ్బతినడంతో చాలాకాలం నుంచి ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement