Saturday, April 20, 2024

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, ప్రణయ్‌..

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ గురువారం సయ్యద్‌మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 టోర్నీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ సింధు రెండో రౌండు మ్యాచ్‌లో అమెరికాకు చెందిన లారెన్‌ లామ్‌పై 21-16, 21-13తేడాతో వరుస గేమ్‌ల్లో గెలుపొందింది. కేవలం 33నిమిషాల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుని టైటిల్‌ దిశగా ముందడుగు వేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ ప్రణయ్‌ తీవ్రంగా పోరాడి విజయం సాధించాడు.

బీబీడీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ భారత్‌కు చెందిన ప్రియాంశు రజావత్‌ నుంచి గట్టి సవాల్‌ ఎదుర్కొని 21-11, 16-21, 21-18తేడాతో గెలుపొందాడు. కాగా గతవారం ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 సెమీస్‌లో థాయ్‌ షట్లర్‌ సుపనిధ చేతిలో ఓటమిపాలైన సింధు మరోసారి తలపడనుంది. ఆకర్షి కశ్యప్‌, మాళవిక బన్సోద్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆకర్షి 21-9, 21-6తేడాతో సాయిపై గెలవగా, మాళవిక 21-10, 21-8తేడాతో ప్రేరణపై విజయం సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement