Friday, March 29, 2024

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. కబ్జారాయుళ్ళ అరెస్ట్

ఓ స్థలం కబ్జా చేయడం కోసం ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు కబ్జారాయుళ్ళ. ఇంకేముంది విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు చెందిన సంగం రాజు గౌడ్, కొమరగౌని శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ లను అరెస్ట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement